Back to feed
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి!
Harini Jun 14, 2026 5:58 AM చిత్తూరు 19 views1 day ago

బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జయదీప్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఓ యువతి ఫోన్ చేయడంతో దండపల్లెకురప్పల్లె వెళ్లిన అతడు తీవ్ర గాయాలపాలై, వేలూరులో చికిత్స పొందుతూ మరణించాడు.
జయదీప్ను యువతి బంధువులే కొట్టి చంపారని మృతుడి కుటుంబం ఆరోపిస్తుండగా, మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడని యువతి కుటుంబీకులు చెబుతున్నారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...


