Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

జంట హత్యల కేసు ప్రధాన నిందితురాలి మృతి

Lokesh Jun 12, 2026 4:07 AM హైదరాబాద్ 8 views3 days ago
జంట హత్యల కేసు ప్రధాన నిందితురాలి మృతి - Udayam Digital
మొయినాబాద్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబేగం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పుల బాధతో గత నెల యాసిడ్ తాగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆబేదాబేగం, మహబూబా అనే ఇద్దరు మహిళలను భర్త, బంధువుతో కలిసి హత్య చేసిన కేసులో ఈమె నిందితురాలిగా ఉంది. ‘నేను చేసిన అప్పులు, తప్పులతో భర్త, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని యాసిడ్‌ తాగాను’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు

Comments

G
Loading comments...