Back to feed
జంట హత్యల కేసు ప్రధాన నిందితురాలి మృతి
Lokesh Jun 12, 2026 4:07 AM హైదరాబాద్ 8 views3 days ago

మొయినాబాద్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబేగం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పుల బాధతో గత నెల యాసిడ్ తాగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆబేదాబేగం, మహబూబా అనే ఇద్దరు మహిళలను భర్త, బంధువుతో కలిసి హత్య చేసిన కేసులో ఈమె నిందితురాలిగా ఉంది. ‘నేను చేసిన అప్పులు, తప్పులతో భర్త, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని యాసిడ్ తాగాను’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు
Comments
Loading comments...


