Back to feed
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Rahul Joshi May 29, 2026 10:59 AM అల్ ఇండియా 17 views1 day ago

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,092 పాయింట్లు పతనమై 74,775 వద్ద, నిఫ్టీ 359 పాయింట్లు నష్టపోయి 23,547 వద్ద ముగిశాయి. దీంతో మదుపర్ల సంపద రూ.5 లక్షల కోట్లు హరించుకుపోయింది.
మార్కెట్ చివరి గంటలో వచ్చిన తీవ్ర అమ్మకాల ఒత్తిడి సూచీలను దెబ్బతీసింది. ఐటీ, పవర్ రంగాలు నష్టపోగా, తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
Comments
Loading comments...



