వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల వరకు పతనమైంది.
చివరకు సెన్సెక్స్ 479 పాయింట్లు నష్టపోయి 76,009 వద్ద ముగియగా, నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 23,913 వద్ద స్థిరపడింది. డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం, ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలు కూడా ఈ నష్టాలకు కారణమయ్యాయి.
Comments
Loading comments...

