వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో చేరికలను సమన్వయం చేసేందుకు 14 మందితో కూడిన ప్రత్యేక కమిటీని పవన్ కల్యాణ్ నియమించారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలను పార్టీలోకి ఆహ్వానించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు.
ఢిల్లీ పర్యటన అనంతరం సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు. ఈ నిర్ణయం పార్టీ బలోపేతానికి కీలకం కానుంది.
Comments
Loading comments...

