Back to feed
మంత్రి లోకేశ్తో జాంటీ రోడ్స్ భేటీ
Rohit Sardana Jun 16, 2026 9:27 AM అమరావతి 9 viewsabout 1 hour ago

ఏపీ మంత్రి నారా లోకేశ్ను స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ కలిశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, యువతకు శిక్షణ, క్రీడా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంపై ఇద్దరూ కీలక అంశాలను చర్చించారు.
ఏపీని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల అనుభవాలను పంచుకోవడం వల్ల యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...



