Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడి కూర గొడవ: తండ్రిని చంపిన కొడుకు

Follow Udayam on Google
Rohit Jun 11, 2026 11:56 AM వరంగల్General
కోడి కూర గొడవ: తండ్రిని చంపిన కొడుకు - Udayam
జనగామ జిల్లా అక్కరాజుపల్లిలో నాటు కోడి కూర వండాలనే వివాదం ఒకరి ప్రాణం తీసింది. రాత్రి వేళ కోడి కూర వండమని రమేష్ (42) తన భార్యతో గొడవకు దిగగా, అడ్డువచ్చిన కొడుకు గణేష్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో క్షణికావేశానికి లోనైన కొడుకు రోకలిబండతో తండ్రి తలపై బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన రమేష్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన కొడుకును అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...