వార్తలకు తిరిగి వెళ్లండి
వెలిజర్ల శివారులో మట్టి మాఫియా విలయతాండవం
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం వెలిజర్లలో అక్రమ మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రకృతి వనరులు, వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని, వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...