వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ప్రమాదకరంగా పడిపోతోంది. పూర్తిస్థాయి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 817.70 అడుగులకు చేరింది. కేవలం 39 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో ఉభయ రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది.
విద్యుదుత్పత్తి కోసం నీటిని అధికంగా వాడటమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. తాగునీటి అవసరాల దృష్ట్యా నీటి నిల్వలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
Comments
Loading comments...

