వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్పై నిర్ణయాన్ని న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వారం రోజుల పాటు పొడిగించింది.
నిందితుడు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపీ వాదించారు. అయితే, నిందితుడి రాజకీయ నేపథ్యాన్ని పదే పదే ప్రస్తావించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
Comments
Loading comments...

