వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్ములా ఈ-రేసు నిధుల మళ్లింపు కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు మళ్లించినట్లు ఏసీబీ అభియోగపత్రంలో పేర్కొంది.
కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ మల్లేశ్వర్రావులకు కూడా సమన్లు అందాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏసీబీ పలువురిని విచారించింది.
Comments
Loading comments...

