వార్తలకు తిరిగి వెళ్లండి

విడవలూరు మండలం వావిళ్ల గ్రామానికి చెందిన ఉప్పల రమేష్ (36), గొర్రెల మేత కోసం ఈ నెల 13న వాహనంతో బయలుదేరి అదృశ్యమయ్యారు. ముత్తుకూరు పరిసరాల్లో వెతుకులాట సాగించినా ఫలితం లేకపోయింది.
ఆయన ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భార్య రేవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రమేష్ ఎక్కడికి వెళ్లారో తెలియక స్థానికులు విస్తుపోతున్నారు.
Comments
Loading comments...

