వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హాంకాంగ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్కు చెందిన దీపక్ జోస్కుట్టి అనే వ్యక్తి హాంకాంగ్ వెళ్లి వస్తూ క్యాథే పసిఫిక్ విమానంలో తన లగేజీలో 7 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని దాచి తీసుకొచ్చాడు.
తనిఖీల్లో పట్టుబడిన ఈ గంజాయి విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

