Back to feed
జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయుల అరెస్ట్
Harika Jun 13, 2026 8:55 AM మేడ్చల్ మల్కాజిగిరి 17 views2 days ago

జీడిమెట్ల పరిధిలోని గాజులరామారం ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి వీసా, పాస్పోర్టు పత్రాలు లేకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.
పోలీసులు, ఎస్వోటీ కూకట్పల్లి జోన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్కు తరలించి, స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...



