Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెన్సెక్స్ 1,073 పాయింట్లు అప్

Follow Udayam on Google
Vikram Chandra May 25, 2026 4:38 PM జాతీయంమార్కెట్లు
 సెన్సెక్స్ 1,073 పాయింట్లు అప్ - Udayam
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కొలిక్కి వస్తాయన్న అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పంద సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో సెన్సెక్స్ 1,073 పాయింట్లు పెరిగి 76,488 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 312 పాయింట్లు లాభపడి 24 వేల మార్కును దాటింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 35 పైసలు పుంజుకుంది.

Comments

G
Loading comments...