వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
వడదెబ్బకు భీమ్గల్ మండలంలో ఓ కూలీ మృతి చెందగా, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

