Back to feed
తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం
Anita Prakash May 21, 2026 4:59 AM హైదరాబాద్ 4 views7 days ago

కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి, మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ సమక్షంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు జూన్ 1 వరకు కొనసాగనున్నాయి.
ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం కూలర్లు, టెంట్లు, 300కు పైగా దుస్తులు మార్చుకునే గదులు, రక్షణ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...



