Back to feed
మంజీరా నదిలో ఇసుక మాఫియా దందా
Vikram Chandra May 29, 2026 6:44 AM సంగారెడ్డి 13 views1 day ago

సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని మంజీరా నదిలో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో నిత్యం ఇసుకను తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ దందా సాగుతోంది.
మితిమీరిన రవాణా వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, మైనింగ్, రెవెన్యూ శాఖలు నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నాయి. అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...


