Back to feed
ఎస్ఆర్హెచ్-ఆర్సీబీ మ్యాచ్ టికెట్లపై సజ్జనార్ హెచ్చరిక
Rohit Verma May 16, 2026 6:39 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

మే 22న ఉప్పల్లో జరగనున్న ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ క్రేజ్ను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సజ్జనార్ హెచ్చరించారు. అధికారిక 'డిస్ట్రిక్ట్' యాప్ లోగోలతో ఉన్న నకిలీ యాప్ల ద్వారా తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారని తెలిపారు.
ఉత్సాహంతో అనధికార లింకులను నమ్మి మోసపోవద్దని, ఇలాంటి ఫేక్ యాప్స్పై నిఘా ఉంచామని ఎక్స్లో పేర్కొన్నారు.
Comments
Loading comments...



