Back to feed
బోరు బావిలో పడిన మనవడు.. కాపాడబోయి తాత మృతి
Priya Singh May 16, 2026 7:17 AM నల్గొండ 0 viewsabout 1 hour ago

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి శివారులో విషాదం జరిగింది. హేమాన్ష్ (4) అనే బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోగా, మనవడిని కాపాడే ప్రయత్నంలో తాత వెంకన్న సైతం అందులో ఇరుక్కుపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరినీ బయటకు తీశారు. అయితే, ఆసుపత్రికి తరలిస్తుండగా తాత వెంకన్న మార్గమధ్యంలోనే మృతి చెందారు.
Comments
Loading comments...



