Back to feed
టావో డిజిటల్ సంస్థను కొనుగోలు చేసిన సైయెంట్
Nisha Joshi Jun 01, 2026 5:56 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago

ప్రముఖ ఐటీ సంస్థ సైయెంట్ లిమిటెడ్.. కృత్రిమ మేధ (AI) ఆధారిత ఇంజినీరింగ్ సేవల సంస్థ 'టావో డిజిటల్'ను కొనుగోలు చేయనుంది. సుమారు రూ.2,070 కోట్ల విలువైన ఈ ఒప్పందం ద్వారా టావో డిజిటల్కు చెందిన 100 శాతం వాటా సైయెంట్ చేతికి రానుంది.
ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ఒప్పందంతో ఆటోమోటివ్, హెల్త్-టెక్ రంగాల్లో తమ ఏఐ, డిజిటల్ ఇంజినీరింగ్ సేవలు మరింత బలోపేతం అవుతాయని సైయెంట్ సంస్థ తెలిపింది.
Comments
Loading comments...



