Back to feed
ప్రభుత్వ తీరుపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం
Rohit Singh Jun 13, 2026 5:29 AM అల్ ఇండియా 10 views2 days ago

రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమై, మొద్దు నిద్ర పోతోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని 'డయల్ యువర్ ఎమ్మెల్యే' కార్యక్రమంలో ఆమె మండిపడ్డారు.
ఫార్మాసిటీపై మాట మార్చి, ఇప్పుడు 'ఫ్యూచర్ సిటీ' పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని సబితా ధ్వజమెత్తారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించి అబద్ధాలతో పాలన సాగిస్తోందని ఆమె ఆరోపించారు.
Comments
Loading comments...



