Back to feed
జూన్ 2న విలీన ప్రకటనకై ఆర్టీసీ జేఏసీ నిరసనలు
Swati Chaturvedi May 30, 2026 6:08 AM హైదరాబాద్ 13 viewsabout 13 hours ago

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు జూన్ 2న అధికారిక ప్రకటన చేయాలనే డిమాండ్తో ఆర్టీసీ యూనియన్లు నిరసనకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా మే 31, జూన్ 1వ తేదీలను 'డిమాండ్ డే'గా పాటించాలని కార్మికులకు సూచించాయి.
జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించారు. అశ్వత్థామ రెడ్డి నాయకత్వంలోని మరో జేఏసీ కూడా జూన్ 1న ఈ డిమాండ్ డే పిలుపునకు మద్దతు పలికింది.
Comments
Loading comments...


