Back to feed
ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు దుర్మరణం
Priya Desai Jun 01, 2026 4:20 AM విశాఖపట్నం 3 viewsabout 1 hour ago

గాజువాక శ్రీనగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా ప్రయాణికులు, సహాయ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...


