Back to feed
బావిలో పడి బాలుడి మృతి
Sonia Singh May 31, 2026 3:02 AM చిత్తూరు 0 viewsabout 1 hour ago

ఐరాల మండలం వీఎస్ అగ్రహారంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరుకు చెందిన ఖాదర్ బాషా కుమారుడు షరీఫ్ (16) సెలవులకై తన తాతగారి ఇంటికి వచ్చాడు. సరదాగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఆ బాలుడు, ప్రమాదవశాత్తు గట్టుపై నుంచి జారి బావిలో పడిపోయాడు.
గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. కళ్లెదుటే కుమారుడు మరణించడంతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...



