Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బావిలో పడి బాలుడి మృతి

Sonia Singh May 31, 2026 3:02 AM చిత్తూరు 0 viewsabout 1 hour ago
బావిలో పడి బాలుడి మృతి - Udayam Digital
ఐరాల మండలం వీఎస్ అగ్రహారంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరుకు చెందిన ఖాదర్ బాషా కుమారుడు షరీఫ్ (16) సెలవులకై తన తాతగారి ఇంటికి వచ్చాడు. సరదాగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఆ బాలుడు, ప్రమాదవశాత్తు గట్టుపై నుంచి జారి బావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. కళ్లెదుటే కుమారుడు మరణించడంతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...