Back to feed
వనపర్తిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
Nidhi Razdan May 29, 2026 7:05 AM వనపర్తి 13 views1 day ago

వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద తీవ్రతకు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...


