Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ధాన్యం సేకరణ గడువు పొడిగింపు: ఈ నెల 15 వరకు కొనుగోళ్లు

Follow Udayam on Google
Ravi Shukla Jun 04, 2026 12:16 PM హైదరాబాద్General
ధాన్యం సేకరణ గడువు పొడిగింపు: ఈ నెల 15 వరకు కొనుగోళ్లు - Udayam
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 15 వరకు పొడిగించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 70.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇది 75 లక్షల టన్నులకు చేరవచ్చని అంచనా వేశారు. నిల్వలు ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే కేంద్రాల్లో పనిచేసే హమాలీలు, స్వీపర్ల వేతనాలు పెంచాలని సూచించారు.

Comments

G
Loading comments...