వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్రోపై కేంద్రమంత్రి కి రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత చర్చలు సానుకూలంగా ముగిసినా, తదుపరి చర్యల్లో జాప్యం జరగడంపై ఆయన ఆందోళన చెందుతున్నారు.
మెట్రో మొదటి, రెండో దశల వ్యయాల పరిశీలనను 'SBI క్యాప్స్'కు అప్పగించే ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై కేంద్ర ప్రతినిధి, సదరు బృందాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం మరోసారి లేఖ రాయనున్నారు.
Comments
Loading comments...