Back to feed
జడ్జీల సంఖ్య పెంచాలని కేంద్రానికి వినతి
Sonal Mehrotra May 21, 2026 8:54 AM హైదరాబాద్ 10 views6 days ago

తెలంగాణ హైకోర్టులో పెండింగ్ కేసులు పెరుగుతున్నందున న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కోరింది. న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి న్యాయవాదుల ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.
త్వరితగతిన కేసుల పరిష్కారం కోసం ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...



