వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-పాక్ చర్చల పునరుద్ధరణకు 100 మంది ప్రముఖుల విజ్ఞప్తి

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి, ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించాలని కోరుతూ ఇరుదేశాలకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు ప్రధానులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్లకు బహిరంగ లేఖ రాశారు. సంపూర్ణ దౌత్య సంబంధాలు, వీసా సేవలను పునరుద్ధరించాలని వారు కోరారు.
జమ్మూ కాశ్మీర్ సహా అన్ని పెండింగ్ అంశాలపై చర్చలు జరపాలని, అత్తారీ-వాఘా సరిహద్దు ద్వారా వాణిజ్యాన్ని, శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు సర్వీసును ప్రారంభించాలని వారు లేఖలో విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...