Back to feed
టెండర్లపై ప్రజాప్రతినిధి పెత్తనం: గుత్తేదారులకు బెదిరింపులు
Ravi Jun 11, 2026 8:37 AM మహబూబ్నగర్ 4 views4 days ago

నగరపాలక సంస్థలో రూ.38 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లలో కీలక ప్రజాప్రతినిధి జోక్యం వివాదాస్పదంగా మారింది. 64 పనులకు సంబంధించి టెక్నికల్ బిడ్లు ఓపెన్ చేసిన అధికారులు, ప్రైస్ బిడ్లు తెరవకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ఈ సమయంలో సదరు ప్రజాప్రతినిధి తన అనుచరులకు పనులు దక్కేలా, ఇతర గుత్తేదారులను టెండర్ల నుండి తప్పుకోవాలని ఒత్తిడి చేయిస్తున్నారు. బిల్లులు ఆగిపోతాయన్న భయంతో పలువురు గుత్తేదారులు వెనక్కి తగ్గుతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ అక్రమాలపై మౌనం వహించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Loading comments...



