Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మళ్లీ అతిసార కలకలం

Raghav Sharma Jun 08, 2026 12:44 PM శ్రీకాకుళం 4 viewsabout 2 hours ago
మళ్లీ అతిసార కలకలం - Udayam Digital
సింగుపురంలో అతిసారం మరోసారి విజృంభించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా వాంతులు, విరేచనాలతో 30 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు, ఆహార కల్తీ దీనికి కారణమని అనుమానిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. అయితే కేసులు నమోదు కాలేదని డీఎంహెచ్‌వో చెప్పడం గమనార్హం.

Comments

G
Loading comments...