Back to feed
అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
Ravi S. Kumar Jun 08, 2026 12:39 PM అమరావతి 7 viewsabout 2 hours ago

మంత్రియా తండాకు చెందిన ధారావతు శ్రీరాములు అనుమానాస్పద మృతి కేసును ఎ.కొండూరు పోలీసులు ఛేదించి, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. భార్య నాగమణి ప్రవర్తనపై శ్రీరాములు అనుమానంతో రోజువారీ గొడవలు పడుతుండటంతో, ఆమె తన సోదరుడు మనోహర్ బాబు, బావ లోకేశ్, అతని కుమారుడు సుమన్లతో కలిసి భర్తను హతమార్చడానికి పథకం వేసింది.
ఈ నెల 5న శ్రీరాములుకు పూటుగా మద్యం తాగించి, దిడ్డుతో ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, అంత్యక్రియల వేళ మృతదేహంపై గాయాలు చూసి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్యతో సహా నలుగురిని అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...



