Back to feed
రెడ్మీ స్మార్ట్ఫోన్ల ధరల పెంపు
Ravi Singh May 25, 2026 10:04 AM అల్ ఇండియా 20 views2 days ago

మెమొరీ చిప్ల కొరత, విడిభాగాల ఖర్చులు పెరగడంతో రెడ్మీ కంపెనీ తన ఫోన్ల ధరలను మరోసారి పెంచింది. రెడ్మీ 15, రెడ్మీ నోట్ 15 మోడళ్లపై రూ.2 వేల వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
దీంతో రెడ్మీ నోట్ 15 (8GB+128GB) ధర రూ.26,999కు చేరగా, రెడ్మీ 15 ప్రారంభ వేరియంట్ ధర రూ.20,499కు పెరిగింది. జనవరిలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఫోన్ల ధరలు దాదాపు రూ.4 వేల వరకు పెరగడం గమనార్హం.
Comments
Loading comments...



