వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
రికార్డు స్థాయిలో అమర్నాథ్ యాత్రకు తరలివెళ్లిన భక్తులు
అమర్నాథ్ యాత్రలో భాగంగా జమ్మూ బేస్ క్యాంప్ నుండి బుధవారం ఒకే రోజు అత్యధికంగా 9,837 మంది భక్తులతో కూడిన ఏడో జత్థా బయల్దేరింది. కట్టుదిట్టమైన బహుళ అంచెల భద్రతా వలయం మధ్య ఈ యాత్రికులు ప్రయాణమయ్యారు.
మొత్తం 361 ప్రత్యేక వాహనాల్లో భక్తులు పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంప్ల వైపు తరలివెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తర్వాత ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లడం ఇదే తొలిసారి.
Comments
Loading comments...