Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మెల్‌బోర్న్ బయల్దేరిన ప్రధానమంత్రి మోదీ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 08, 2026 2:17 PM జాతీయంGeneral
మెల్‌బోర్న్ బయల్దేరిన ప్రధానమంత్రి  మోదీ - Udayam
ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరారు. తన మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఇండోనేషియా రాజధాని జకార్తా నుండి మెల్‌బోర్న్ నగరానికి ప్రయాణమయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టారు. మెల్‌బోర్న్‌లో జరిగే ద్వైపాక్షిక చర్చలు, భారత్-ఆస్ట్రేలియా వార్షిక నేతల శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...