Back to feed
తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించరా: పవన్ కల్యాణ్
Ravi Jun 15, 2026 12:17 PM హైదరాబాద్ 6 viewsabout 2 hours ago

తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించేందుకు అనుమతి నిరాకరించడం బాధాకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగాలను గుర్తించడానికి 12 ఏళ్లు సరిపోలేదా? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ నేల అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు.
నాయకులు అధికారం కోసం యువతను బలి చేశారని పవన్ మండిపడ్డారు. అమరవీరుల ఆశయాల సాధనలో జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుందని, కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...


