Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రావిర్యాల హౌసింగ్ బోర్డు స్థలాలకు రికార్డు ధర

Sonal Mehrotra May 29, 2026 5:50 AM హైదరాబాద్ 12 views1 day ago
రావిర్యాల హౌసింగ్ బోర్డు స్థలాలకు రికార్డు ధర - Udayam Digital
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని హౌసింగ్ బోర్డు స్థలాలకు గురువారం నిర్వహించిన ఈ-వేలంలో రికార్డు స్థాయి ధరలు పలికాయి. నాలుగు ప్లాట్ల వేలం ద్వారా చదరపు గజం గరిష్టంగా రూ.83,500 కు అమ్ముడుపోగా, ప్రభుత్వానికి సుమారు రూ.140 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఈ వేలంలో 17 సంస్థలు పోటీ పడ్డాయి. కాగా, కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతాల్లోని మరికొన్ని స్థలాలకు శుక్రవారం ఈ-వేలం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...