Back to feed
అదిలాబాద్లో అరుదైన మియాజాకి మామిడి పండ్ల సాగు!
Harika Jun 12, 2026 10:53 AM ఆదిలాబాద్ 19 views3 days ago

అదిలాబాద్ జిల్లా ముఖ్రా(కె)లో మాజీ సర్పంచ్ గడ్గె మీనాక్షి అరుదైన మియాజాకి మామిడి పండ్లను పండించారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాటిన మొక్కలు ఇప్పుడు ఫలాలను ఇచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ. 2.50 లక్షల వరకు విలువ చేసే ఈ అరుదైన పంటను పండించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన పొలంలో ఇతర మొక్కలతో పాటు వీటిని నాటానని మీనాక్షి తెలిపారు.
Comments
Loading comments...



