Back to feed
చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ పూజలు
Priya Ranjan May 27, 2026 8:34 AM అల్ ఇండియా 8 viewsabout 11 hours ago

'కాంతార' సినిమా సన్నివేశాన్ని అనుకరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మంగళవారం మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఈ వివాదంపై ఆయన క్షమాపణలు చెప్పగా, అందులో నిజాయతీ లేదంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, ప్రాయశ్చితంగా నాలుగు వారాల్లోగా చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని రణ్వీర్ను ఆదేశించింది. కోర్టు విధించిన గడువు ముగియనుండటంతో ఆయన ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...



