Back to feed
పసిడి ధరలను మించిపోయిన రంగారెడ్డి భూముల విలువ: సీఎం రేవంత్ రెడ్డి
Rohit Jun 10, 2026 3:17 PM రంగారెడ్డి జిల్లా 17 views5 days ago

తెలంగాణ ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి, ఈ నగరం త్వరలోనే న్యూయార్క్, సింగపూర్లతో పోటీపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు బంగారం కంటే ఎక్కువయ్యాయని చెప్పారు.
చెరువుల కబ్జాల వల్లే నగరంలో వరదలు వస్తున్నాయని, అందుకే 'హైడ్రా' ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇప్పటికే పూర్తిగా తిరస్కరించారని సీఎం విమర్శించారు.
Comments
Loading comments...



