వార్తలకు తిరిగి వెళ్లండి
పంజాబ్ హస్తం పార్టీలో ముదిరిన సంక్షోభం

2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం బుధవారం ప్రకటించిన కొత్త కమిటీ పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభానికి దారితీసింది. పీసీసీ అధ్యక్షుడిగా లూథియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వడింగ్ను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయమే ఈ లుకలుకలకు ప్రధాన కారణమైంది.
అధిష్టానం ఏకపక్ష నిర్ణయంపై పార్టీలోని పలువురు సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల కమిటీ అసమ్మతి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చడంతో పంజాబ్ కాంగ్రెస్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
Comments
Loading comments...