వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ సులభంగా పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవడమే లక్ష్యమని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వినియోగదారుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్ విధానాన్ని మరియు స్వల్పకాలిక ప్లాన్లను తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లలో పీఎం వాణి హాట్స్పాట్లను సులభంగా గుర్తించేందుకు వీలుగా ప్రామాణిక గుర్తులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను త్వరలోనే దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.
Comments
Loading comments...

