Back to feed
ధాన్యం నిల్వ కోసం తగినన్ని స్థలాలను అందుబాటులోకి తీసుకురావాలి.
Rajesh Nyamathabad May 20, 2026 9:37 AM నిర్మల్ 5 views7 days ago

నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో సమీక్షించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని, అవసరమైతే ఇతర జిల్లాల్లోని గోదాములను గుర్తించాలని ఆదేశించారు. రవాణాకు తగినన్ని లారీలు, హమాలీలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ధాన్యం తరలింపులో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...



