Back to feed
కరీంనగర్లో మక్క రైతుల ఆందోళన
Sneha Mohan May 25, 2026 6:16 AM కరీంనగర్ 18 views3 days ago

మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ మూసివేసి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సంచుల కొరతతో పాటు సకాలంలో తూకం వేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. ఈ ఆందోళనతో మార్కెట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Comments
Loading comments...



