వార్తలకు తిరిగి వెళ్లండి
పేదరిక నిర్మూలనలో దేశం కొత్త రికార్డు: సీఎం యోగి ఆదిత్యనాథ్
శిరీష గౌడ్ Jun 27, 2026 6:06 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

ప్రధాని మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతదేశం అద్భుతమైన ప్రగతిని సాధించిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. గృహనిర్మాణం, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాలు దేశ రూపురేఖలను మార్చేశాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశంలో రికార్డు స్థాయిలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి పొందారని తెలిపారు. వీరంతా మధ్యతరగతిలోకి ప్రవేశించి దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని గోరఖ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం పేర్కొన్నారు.
Comments
Loading comments...