Back to feed
ధాన్యం రైతులపై పోలీసు కేసులు
Harika Jun 16, 2026 8:25 AM మంచిర్యాల 13 viewsabout 1 hour ago

మంచిర్యాల జిల్లా గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పంటను సకాలంలో కొనాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు.
నెల రోజులుగా కాంటా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సముదాయించినా ఫలితం లేకపోగా, నిరసన తెలిపిన వారిపైనే కేసులు పెట్టడం స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...



