Back to feed
రైతులపై పోలీసు కేసు
Anjali Sharma May 25, 2026 6:40 AM ఖమ్మం 22 views3 days ago

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులైనా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.
అయితే, పంటను తరలించాల్సిన ప్రభుత్వం.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో ఉల్టా ముగ్గురు రైతులపై కేసులు పెట్టడం గమనార్హం.
Comments
Loading comments...



