Back to feed
ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి దందా: నిందితుడిని పట్టుకున్న పోలీసులు!
Neha Jun 11, 2026 5:27 AM హైదరాబాద్ 7 views4 days ago

హైదరాబాద్ గోపనపల్లిలోని సాఫ్ట్వేర్ కంపెనీ గేటు వద్ద గంజాయి విక్రయిస్తున్న సెక్యూరిటీ గార్డ్ బికాశ్ బైక్ను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి ఐటీ ఉద్యోగులకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
నిందితుడి నుంచి కేజీన్నర గంజాయిని, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



