Back to feed
పోలవరం ప్రాజెక్టు: తొలిదశ పనులపై గడువు
Rohit Jun 19, 2026 8:50 AM అమరావతి 3 viewsabout 3 hours ago

పోలవరం తొలిదశ పనులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేయాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ ఆదేశించారు. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పనులపై సీఎం సమీక్ష నేపథ్యంలో ఈ గడువు విధించారు.
ఈసీఆర్ఎఫ్ డ్యాం, ఎడమ కాలువ మినహా మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన ముగించాలని అధికారులకు సూచించారు. జంట సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్ వంటి కీలక పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...



